జబర్దస్త్ చూసే వాళ్ళకి షాకింగ్ న్యూస్

ఈటీవీ లో 2013 లో స్టార్ట్ అయిన జబర్దస్త్ ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇందులో చాలా మంది కమెడియన్స్ పరిచయమయ్యారు. వారంతా ఇప్పుడు సెలబ్రిటీలు అయ్యారు. అద్భుతమైన కంటెంట్తో టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతున్నారు. ప్రతివారం మంచి రేటింగ్ వస్తూనే ఉంది. అంతేకాదు ఈ షో లో అద్భుతమైన నటనతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ముఖ్యంగా గెటప్ శీను లాంటివాళ్ళు చాలా బాగా ఆక్టింగ్ చేస్తాడు. హైపర్ ఆది తన పంచులతో మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఇందులో చేసే అందరికీ మంచి పేరుతో పాటు మంచి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

మెగాస్టార్ పవర్ స్టార్ లాంటి వారితో నటిస్తున్నారు కూడా . అయితే ఈ జబర్దస్త్ షో గతకొంతకాలంగా టీవీలో రావడంలేదు. కరోనా కారణంగా ఈ షో నిలిపివేశారు. అయితే మళ్లీ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందని అనుకుంటున్నారు. కరోనా కారణంగా టీవీ సీరియల్స్ ఇలాంటి జబర్దస్త్ షో లు అన్ని ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. అయితే త్వరలోనే ప్రభుత్వం ఈ షోలకు పర్మిషన్ ఇస్తుందని అనుకుంటున్నారు. కాకపోతే కొన్ని కండిషన్స్ తో ఇలాంటి షోలు ప్రసారం చేయవచ్చని షూటింగ్లు చేసుకోవచ్చని పరిమిషన్ ఇస్తారని తెలుస్తోంది. ఇలా అందరితోపాటు కాకుండా కొంత మందితో చేయడానికి పరిమిషన్ ఇస్తారని తెలుస్తోంది. ఎక్కువ నటులతో కాకుండా తక్కువ మంది తో షూటింగ్ కి పర్మిషన్ ఇస్తారని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. AcceptRead More